పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు దేవళంపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద ఆదివారం రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు అనంత కుమారాచార్యులు తెలిపారు.
ఈ వేడుకలలో భాగంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహించడంతోపాటు గ్రామోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.




