శీర్షిక: అక్షర రూపంలో గణతంత్ర శుభాకాంక్షలు! 📚🇮🇳
ఈ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, మా సేవామందిర్ శ్రీ ఎ.యం. లింగన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు “విద్యే ఆయుధం”. ఆ ఆయుధాన్ని మా పాఠశాల విద్యార్థులకు అందించాలనే చిన్న ప్రయత్నంతో, 2005-2010 బ్యాచ్ పూర్వ విద్యార్థులం కలిసి నోట్బుక్స్, పెన్నులు మరియు జామెట్రీ బాక్సులను పంపిణీ చేశాము.
మా ఎదుగుదలకు పునాది వేసిన పాఠశాలకు మరియు రేపటి పౌరులకు మా వంతు తోడ్పాటు అందించడం మా బాధ్యతగా భావిస్తున్నాము.
ఈ కార్యానికి సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.




