Home South Zone Andhra Pradesh మదనపల్లిలో కరెంట్ షాక్: రైతుకు తీవ్ర గాయాలు.

మదనపల్లిలో కరెంట్ షాక్: రైతుకు తీవ్ర గాయాలు.

0
0

మదనపల్లి మండలంలో మంగళవారం రాత్రి కరెంట్ షాక్ ఘటన చోటుచేసుకుంది. కోటవారిపల్లికి చెందిన పాండు (45) అనే రైతు పొలం వద్ద మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.

కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

NO COMMENTS