మదనపల్లి 1 టౌన్ సీఐ మహమ్మద్ రఫీ బుధవారం మదనపల్లిలోని కోటబడి హోప్ మునిసిపల్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం ద్వారా భవిష్యత్తును నాశనం చేసుకోకుండా కాపాడుకోవాలని సూచించారు.




