దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు అధికారులతో కలిసి దర్శి పట్టణం–పొదిలి రోడ్లోని 8వ వార్డ్లో పలు సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు ₹42 లక్షల వ్యయంతో నిర్వహించిన భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు గారు, టీడీపీ యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ గారు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్ గారు, స్థానిక నాయకులు, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.






