బాపట్ల: అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్ల కి కనీసవేతనాలు అమలుచేయాలి, దేశవ్యాప్తంగా బడ్జెట్ పెంపుదల చేయాలి అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ సిఐటియుగా బాపట్ల ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద నిరసన..12వ తేదీ సమ్మెలో అంగన్వాడీలుజయప్రదంచేయాలి.సిఐటియు బాపట్ల జిల్లా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కార్యదర్శి రేఖ ఎలిజిబెత్
అంగన్వాడీల వేతనాలు పెంపుదల కోసం ప్రాజెక్ట్ కార్యాలయాలు వద్ద ఆందోళనలు పిలుపులో బాగంగా ఐసిడిఎస్ బాపట్ల ప్రాజెక్ట్ ఆఫీసు వద్ద సాయంత్రం నాలుగు గంటల సమయంలో చేతుల పిడికిలి బిగబట్టి నిరసన తెలియజేయుటం జరింగింది ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి రేఖ ఎలిజిబెత్ మాట్లాడుతూ..
ఐసిడిఎస్ కి ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు తగ్గించటం వల్ల సరైన మౌలిక సదుపాయాలు,మంచి నాణ్యమైన ఆహారం,ఐసిడిఎస్ వ్యవస్థలో భాగమైన వర్కర్లు,హెల్పర్లు సరైన వేతనాలు,ఉద్యోగ భద్రత కల్పించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి,ప్రధానంగా అంగన్వాడీ వర్కర్ల,హెల్పర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,కనీస వేతనాలు,పెన్షన్,PF,ESI సామాజిక భద్రత సౌకర్యాలు అమలుచేయాలి, అంగన్వాడీలకు 26,000, కనీసవేతనాలు మరియు 10,000 పెన్షన్ చెల్లించాలి,రిటైర్ అయిన అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పుప్రకారం గ్రాట్యుటీ చట్టం అమలుచేయాలి,ఐసిడిఎస్ ప్రైవేటీకరించరాదు,ఎఫ్ఆర్ఎస్ యొక్క ఇ-కెవైసి పేరుతో లబ్ధిదారులను తొలగించరాదు,డిజిటలైజేషన్ FRS పేరుతో అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్లను వేధించకూడదు,ఐసిడిఎస్ కు సంబంధం లేని అదనపు పనులైన పెన్షన్ పంపిణీ లాంటి ఇతర పనులు అప్పగించరాదు, ఈ కార్యక్రమంలో రేపల్లె ప్రాజెక్ట్ అధ్యక్షురాలు శైల శ్రీ,,కార్యదర్శి హేమమాలిని, కోశాధికారి సీత తదితరులు పాల్గొన్నారు.
#Narendra
