అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ, ఉద్యానవన, సూక్ష్మ నీటిపారుదల, పశుసంవర్ధక, మార్కెటింగ్ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ-క్రాప్ బుకింగ్, సీసీఆర్సీ కార్డులు, భూసార పరీక్షల లక్ష్యాలను పూర్తి చేయాలని, యూరియా కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. రైతులకు ఉద్యానవన పంటలపై అవగాహన పెంచి వాటి వైపు మొగ్గు చూపేలా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలని సూచించారు. వరి నుంచి ఉద్యాన పంటల వైపు రైతులను మళ్లించాలన్నారు.
