హైదరాబాద్ : అవినీతి అధికారుల గుండెల్లో తెలంగాణ ఏసీబీ మరోమారు వణుకు పుట్టించింది. కూకట్ పల్లి జిహెచ్ఎంసి కార్యాలయంలో తిష్ట వేసిన ఒక అవినీతి తిమింగలం నేడు అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కింది.
ఒక కాంట్రాక్టర్ నుండి ఏకంగా 15 లక్షల నగదును లంచంగా తీసుకుంటూ కూకట్ పల్లి జోనల్ సూపర్ ఇండెంట్ ఇంజనీర్ (SE) చిన్నారెడ్డి పట్టుబడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. కూకట్ పల్లి జోన్ పరిధిలో పనులు పూర్తిచేసిన ఓ కాంట్రాక్టర్ కు సంబంధించిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి ఎస్.ఈ చిన్నారెడ్డి భారీ మొత్తాన్ని డిమాండ్ చేశాడు
లంచం ఇస్తేనే ఫైళ్లు ముందుకు కదులుతాయని ఖరాఖండిగా చెప్పడంతో, భాదితుడు చేసేదేమీ లేక ఏసీబీని ఆశ్రయించాడు.
అధికారుల వ్యూహం ప్రకారం, నేడు కార్యాలయంలో నగదు తీసుకుంటుండగా ఏసీబీ బృందం ఆయన్ని చుట్టుముట్టింది.
రసాయనాలు పూసిన నోట్లను చిన్నారెడ్డి తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.
చిన్నారెడ్డిని అదుపులోకి తీసుకున్న అనంతరం, ఆయన కార్యాలయం తో పాటు, ఆయన నివాసంలోను ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోధాలు నిర్వహిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడా! అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు.
కూకట్ పల్లి జిహెచ్ఎంసి విభాగంలో ఇంతటి భారీ అవినీతి బయటపడడం నగరవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల అండదండలతో ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నారా! అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో చిన్నారెడ్డి పై అవినీతి ఆరోపణలు వచ్చినట్టు సమాచారం.
#sidhumaroju
Alwal
