బాపట్ల : మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశ్యపూర్వకంగానే రెచ్చగొట్టి, దాడులకు తెగబడి అరెస్టు దాకా తీసుకెళ్లారని ఇది అన్యాయమని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు.
తిరుపతి లడ్డు విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు చేసిన రాజకీయం సిట్ దర్యాప్తు నివేదిక తేటతెల్లం చేసిందని, దీనిని పక్కదోవ పట్టించడానికి మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్టు చేసి, ఈ వ్యవహారాన్ని వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
అంబటి కార్యాలయాన్ని తగులబెట్టి, ఇంటిని ముట్టడించే ప్రయత్నాలు చేయడమే లక్ష్యంగా వీరంగం చేసిన ఘటన ను తీవ్రముగా ఖండించారు.
ఇదే తరహాలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను ప్రోత్సహించడం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం తీవ్రంగా ఖండనీయమన్నారు.
#Narendra






