పుంగనూరు నియోజకవర్గం, బోయకొండ పరిసర ప్రాంతంలో రహస్యంగా కోడిపందెం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం డ్రోన్ కెమెరాల సహాయంతో దాడులు నిర్వహించింది.
ఈ దాడుల్లో కోడిపందెం ఆడుతున్న 13మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి ఆరు కోళ్లు, రూ. 25వేల నగదు, 11 వాహనాలు, 13 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది
# కొత్తూరు మురళి.
