జిల్లా లో ఈ విధానం ద్వారా ముఖ్యంగా పోక్సో కేసులు,మహిళలు చిన్నారులపై జరిగే నేరాలు వంటి సున్నితమైన కేసుల్లో బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా తమ నివాసం లేదా తమకు అనుకూలమైన ప్రదేశంలోనే ఫిర్యాదు నమోదు చేసుకునే సౌకర్యం కల్పించబడింది.
బాధితులపై ఉన్న మానసిక ఒత్తిడిని తగ్గించడం పోలీస్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈ నేపథ్యంలో రేగోడ్ మండలంలో జరిగిన ఒక హత్య కేసులో బాధితుని నివాసంలోనే ఫిర్యాదు స్వీకరించారు.ఈ కొత్త విధానం ద్వారా బాధితులకు న్యాయం త్వరగా అందించడంతో పాటు ప్రజలకు మరింత సానుభూతి బాధ్యతతో కూడిన పోలీసింగ్ సేవలు అందించబడుతున్నాయి.
