మీ భూమి – మీ హక్కు పెద్దారవీడు మండలం, గొబ్బూరు గ్రామ సచివాలయం వద్ద ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, మండల టీడీపీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాస రెడ్డి గారు, సీనియర్ నాయకులు, గొబ్బూరు గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు గారు మాట్లాడుతూ — గత వైసీపీ పాలనలో రైతులకు ఇచ్చిన పాసు పుస్తకాలపై కూడా జగన్ మోహన్ రెడ్డి తన ఫోటో వేసుకుని, ప్రభుత్వ పథకాలను వ్యక్తిగత ప్రచారానికి వాడుకున్నారని విమర్శించారు.కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రైతుల హక్కును గౌరవిస్తూ, ప్రభుత్వ రాజముద్రతో పాసు పుస్తకాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు.




