శుక్రవారం రాత్రి నిమ్మనపల్లి మండలంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో బాలినాయుని పల్లెకు చెందిన శ్రీనివాసులు అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు.
సొంత పనిమీద కందూరికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మఠంతోపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. బాధితుడిని కుటుంబ సభ్యులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.




