అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని కంభంవారిపల్లె క్రాస్ వద్ద ఉన్న కోళ్ల ఫారంను పశుసంవర్ధక శాఖ జెడి ఉమాదేవి, ఇతర జిల్లా స్థాయి అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు.
మండలంలో పెద్ద సంఖ్యలో నాటు కోళ్లు మృత్యువాత పడటంతో, వాటి నమూనాలను భోపాల్ ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. నివేదిక త్వరలోనే వస్తుందని, ప్రస్తుతం కొక్కర తెగుళ్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు# కొత్తూరు మురళి.




