Home South Zone Andhra Pradesh Municipal Commissioners Transfers Andhra Pradesh

Municipal Commissioners Transfers Andhra Pradesh

0

అనంతపురం మున్సిపల్ కమిషనర్‌గా ఎం. జస్వంత్‌రావు నియామకం

రాష్ట్రవ్యాప్తంగా పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పలు మున్సిపాలిటీలు, యూడీఏలు, కార్పొరేషన్లలో కీలక అధికారుల మార్పులు చేపట్టింది.

అనంతపురం మున్సిపల్ కమిషనర్‌గా ఎం. జస్వంత్‌రావును నియమించగా.. అక్కడ పనిచేస్తున్న బి. బాలస్వామిని విజయనగరానికి బదిలీ చేశారు. పల్నాడు యూడీఏ కార్యదర్శిగా ఉన్న జి. సాంబశివరావును గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. గుంటూరులో ఉన్న టి. వెంకటకృష్ణయ్యను పల్నాడు యూడీఏ సెక్రటరీగా నియమించారు.

గుంతకల్ కమిషనర్‌గా పనిచేస్తున్న సీఎంఏ నయీం అహ్మద్‌ను ఆదోనికి బదిలీ చేయగా.. అక్కడ ఉన్న కృష్ణను సీఆర్‌డీఏకు పంపించారు. ఏలూరు యూడీఏ కార్యదర్శిగా వెయిటింగ్‌లో ఉన్న పి. సింహాచలంను నియమించారు. ఒంగోలు యూడీఏ కార్యదర్శిగా ఉన్న ఆర్‌ చండి దేవసేనను తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీ చేశారు.

విజయవాడలో శానిటరీ ఇన్స్‌పెక్టర్‌‌గా ఉన్న కె. శివరామ్‌ప్రసాద్‌ను వినుకొండ కమిషనర్‌గా నియమించారు. వినుకొండలో శానిటరీ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న ఎం. సుభాష్ చంద్రబోస్‌ను సీడీఎంఏకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. అలాగే, కల్యాణదుర్గంలో శానిటరీ ఇన్స్‌పెక్టర్‌‌గా ఉన్న ఎస్‌. నూర్ అలీఖాన్‌ను కమలాపురం నగరపంచాయతీ కమిషనర్‌గా నియమించారు. అక్కడ పనిచేస్తున్న ప్రహ్లాద్‌ను సీడీఎంఏకు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

NO COMMENTS

Exit mobile version