అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 2 డిపో గౌరవ అధ్యక్షులుగా జోలపాలెం దేవేంద్రబాబు (చిన్ని) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం మున్న (తారక్) చిన్న ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. కేక్ కట్ చేసి, శాలువా, పుష్పగుచ్ఛాలతో దేవేంద్రబాబును సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. డిపో అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమానికి ఆయన నాయకత్వం బలంగా నిలుస్తుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.




