అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలంలో పుట్టవారిపల్లి, అమ్మగారిపల్లి, కంభంవారిపల్లి గ్రామాల్లో ఆదివారం బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. వారం రోజులుగా మూడు కోళ్ల ఫారాల్లో దాదాపు 28 వేల కోళ్లు మృతి చెందాయి. మిగిలిన కోళ్లను ఊరి బయట గుంతలు తవ్వి పూడ్చివేస్తున్నారు. మూడు ఫారాలను అధికారులు సీజ్ చేశారు.




