కొత్తకోటలోని బిసికాలనీలో మహమ్మద్ హుస్సేన్ కుమార్తె ఆర్షియా (18) అదృశ్యమైంది. ఇంటర్మీడియట్ వరకు చదివిన ఆర్షియా రెండు రోజుల క్రితం, ఇంట్లో ఎవరూ లేనప్పుడు తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇంటి నుండి వెళ్లిపోయింది. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక సీఐ గోపాల్ రెడ్డి ఈ ఘటనపై వివరాలు తెలుసుకుంటున్నారు.




