Monday, February 9, 2026
spot_img
HomeSouth ZoneTelangana₹18 లక్షల అభివృద్ధి పనులు: సబిత అనిల్ కిషోర్ గౌడ్ శంకుస్థాపన

₹18 లక్షల అభివృద్ధి పనులు: సబిత అనిల్ కిషోర్ గౌడ్ శంకుస్థాపన

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వెంకటాపురం డివిజన్ లోని కనాజిగూడ శ్రీనివాస కాలనీలో స్థానిక శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు.. సుమారు 18 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన జరిగింది.

కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో.. బస్తీ వాసులు వీరేష్, కన్నా, దేవయ్య గౌడ్, శంకర్, నరేష్, సుజాత, కళావతి, జమున, సురేష్, విజయ్ శేఖర్, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

ఈ నూతన సీసీ రోడ్డు నిర్మాణం వల్ల స్థానికులకు మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుందని కాలనీవాసులు హర్ష వ్యక్తం చేశారు.

#sidhumaroju
Alwal

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments