మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వెంకటాపురం డివిజన్ పరిధిలోని ప్రజల దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపే దిశగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కీలక అడుగులు వేశారు. మంగళవారం వెంకటాపురం లాస్ట్ బస్ స్టాప్ లో సమీపంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బాక్స్ డ్రెయిన్ పనులకు, అలాగే ఓల్డ్ వెంకటాపురం మారుతి నగర్ కాలనీల్లో ₹ 23. లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో.. కార్పొరేటర్ చింతల శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, లతో భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న వరద నీరు మురుగునీటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ బాక్స్ డ్రెయిన్ పనులు మంజూరు చేయించాం.
ఈ డ్రెయిన్ నిర్మాణం పూర్తయితే పరిసరాల కాలనీలో ప్రజలకు జలదిగ్బంధం నుండి విముక్తి కలుగుతుంది. మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది. పనుల నాణ్యతలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం.. అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ డీ.ఈ. ప్రశాంతి, ఏ.ఈ అరుణ్, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal
