Home South Zone Andhra Pradesh మదనపల్లిలో యువకుడు అనుమానాస్పద మృతి

మదనపల్లిలో యువకుడు అనుమానాస్పద మృతి

0

మదనపల్లె మండలానికి చెందిన 25 ఏళ్ల కిరణ్ కుమార్ సోమవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. స్థానిక సురేష్ కుటుంబానికి చెందిన ఆడపిల్లను ఏడిపించాడన్న అనుమానంతో, సురేష్ మరియు అతని స్నేహితులు మూడు రోజుల క్రితం కిరణ్ కుమార్ ను ఊరి చివరికి తీసుకెళ్లి డంబెల్ తో దారుణంగా కొట్టినట్లు మృతుడి సోదరి గంగాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో కిరణ్ కుమార్ తలకు, గొంతుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

NO COMMENTS

Exit mobile version