Home South Zone Andhra Pradesh ఈ–పంట నమోదు వేగవంతం చేయాలి: జేసీ అపూర్వభారత్

ఈ–పంట నమోదు వేగవంతం చేయాలి: జేసీ అపూర్వభారత్

0

కాకినాడ జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించిన ఈ–పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్ అపూర్వభారత్ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో జిల్లాలో 70 వేల హెక్టార్ల లక్ష్యానికి గాను 69 వేల హెక్టార్లలో పరి నాళ్లు పూర్తయ్యాయని, ఈ–పంట నమోదు 73 శాతం మాత్రమే జరిగిందని తెలిపారు.

మిగిలిన నమోదును త్వరగా పూర్తి చేయాలని, ఈ నెలాఖరుకు రబీ ధాన్యం సేకరణ ప్రక్రియ సిద్ధం చేయాలని సూచించారు. ఈ–పంట నమోదు పూర్తయితే రైతులకు భరోసా, ధాన్యం సేకరణలో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు.

NO COMMENTS

Exit mobile version