చీరాల: చీరాల మండలం జాతీయ రహదారి–216పై తోటవారిపాలెం సమీపంలో తెల్లవారుజామున కారు ప్రమాదం చోటుచేసుకుంది. అడ్డంగా ఒక్కసారిగా అడ్డంకి రావడంతో డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేయగా వాహనం అదుపు తప్పి రహదారి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది.
#Narendra




