చీరాల: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) Jan 28 నుంచి ప్రారంభించిన ‘వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్-2026’ ఈరోజు చీరాల తీర ప్రాంతం నందు ఘన స్వాగతం పలికిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు తెలిపారు. చీరాల తీర ప్రాంతం రామాపురం నందు వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్ CISF members కి విశ్రాంతి అరేంజ్మెంట్ చేయడం జరిగింది.
‘సురక్షిత తీరాలు…
సమృద్ధ భారత్’ నినాదంతో చేపట్టే సైక్లింగ్ యాత్ర దేశంలోని తొమ్మిది తీర ప్రాంత రాష్ట్రాల్లో 6,553 కి.మీ. పొడవున 25 రోజులపాటు సాగుతుందని చెప్పారు. ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్లో 8 రోజుల పాటు 964 కి.మీ. మేర సాగుతుందన్నారు.
జనవరి 28న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి నిత్యానందరాయ్ ప్రారంభించిన ఈ యాత్ర ఫిబ్రవరి 9న చీరాల చేరుకుందన్నారు. ఈ యాత్ర ఫిబ్రవరి 22ను ముగుస్తుందని, యాత్రలో 130 మంది సీఐఎ్సఎఫ్ సిబ్బంది పాల్గొంటారని, అందులో 65 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారని తెలిపారు.
#Narendra
