కాకినాడ జిల్లా కరప మండలంలో వరుస రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గురువారం ఒక్కరోజే కరప, పెనుగుదురు పరిసరాల్లో మూడు ప్రమాదాలు జరగగా, రాత్రివేళల్లో దొంగల బెడద పెరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు తక్షణమే స్పందించి రాత్రి గస్తీని పెంచాలని, శాంతిభద్రతలను కాపాడాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




