ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లను దూషించిన కేసులో మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.
తనపై నమోదైన కేసును కొట్టివేయాలన్న ఆయన క్వాష్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది.
తదుపరి విచారణను మార్చి 12కు వాయిదా వేస్తూ, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.




