అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పుంగనూరులోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థినుల చదువు సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్న ఆయన, వారికి అందుతున్న భోజన నాణ్యత, వసతులు మరియు పరిశుభ్రతను స్వయంగా పరిశీలించారు.
వసతి గృహంలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని, బాలికల సౌకర్యార్థం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు, సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు.
#కొత్తూరు మురళి.




