కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు తల్లిలా ప్రేమాభిమానాలు అందించాలని సమగ్ర శిక్షా ఏపీసీ డాక్టర్ నున్నా అనురాధ సూచించారు.
రాయలసీమ జిల్లాలకు చెందిన 75 మంది ప్రత్యేకాధికారులకు నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ ముగింపు సభలో ఆమె మాట్లాడారు. బాలికల సమగ్ర అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా, బాధ్యతాయుతమైన నాయకులుగా పనిచేయాలని ఆమె దిశానిర్దేశం చేశారు.




