మదనపల్లె పాలెంకొండ ప్రాథమిక పాఠశాలను ఆక్రమణదారుల నుండి కాపాడాలని పూర్వ విద్యార్థిని నాగలక్ష్మి మంత్రి నారా లోకేశ్కు లేఖ రాశారు.
ఒక రాజకీయ నేత పాఠశాల స్థలాన్ని కబ్జా చేసేందుకు కుట్ర పన్నారని, ఉపాధ్యాయులను బెదిరిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.
పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, వెంటనే స్పందించి 1991లో ఏర్పాటైన ఈ పాఠశాల ఉనికిని కాపాడాలని ఆమె విద్యాశాఖ మంత్రిని వేడుకున్నారు.










