పుంగనూరు పట్టణంలోని కోనేటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 24 నుంచి మార్చి 4 వరకు వైభవంగా జరగనున్నాయి.
టీటీడీ అధికారులు వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం, ప్రతిరోజూ ఉదయం మరియు రాత్రి వేళల్లో స్వామివారికి వాహన సేవలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28న విశేషమైన గరుడ వాహన సేవ, మార్చి 2న ఆలయ ప్రాంగణంలో శ్రీవారి కళ్యాణోత్సవం జరగనున్నాయి.
భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.




