Home South Zone Andhra Pradesh శివరాత్రికి భారీ భద్రత: మదనపల్లె డీఎస్పీ |

శివరాత్రికి భారీ భద్రత: మదనపల్లె డీఎస్పీ |

0

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మదనపల్లె డీఎస్పీ మహేంద్ర తెలిపారు.

మడికైల, మల్లయ్య కొండ, వాలేశ్వర స్వామి, తవలం నేల మల్లేశ్వర స్వామి ఆలయాల వద్ద భక్తులకు అసౌకర్యం కలగకుండా 200 మంది పోలీసులతో రెండంచెల భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

ట్రాఫిక్ నియంత్రణతో పాటు క్యూ లైన్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండు రోజుల పాటు ఈ నిఘా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

NO COMMENTS

Exit mobile version