మహాశివరాత్రికి ముస్తాబైన శైవ క్షేత్రాలు!

0
0

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పుంగనూరు నియోజకవర్గంలోని ప్రముఖ శివాలయాలు సర్వాంగ సుందరంగా సిద్ధమయ్యాయి.

సోమల గార్గేయ మునీశ్వరాలయం, చౌడేపల్లి మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం, పులిచెర్ల చంద్రమౌళీశ్వరాలయంతో పాటు అగస్తీశ్వర స్వామి దేవాలయాల్లో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు.

అభిషేకాలు, విశేష పూజలకు ఆలయ కమిటీలు సిద్ధమయ్యాయి. ఈ వేడుకల కోసం నియోజకవర్గవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.