ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 1995 నాటి పద్ధతిలో నిక్కచ్చిగా వ్యవహరిస్తానని, ప్రతి ఒక్కరి గ్రాఫ్ అంచనా వేసి ‘సీల్డ్ కవర్ల’లో నివేదికలు ఇస్తున్నట్లు తెలిపారు.
లోపాలు సరిదిద్దుకోకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
అదే సమయంలో లోకేశ్ తన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తున్నారని, ముఖ్యంగా మంగళగిరి చేనేతకు బ్రాండింగ్ కల్పించే ప్రయత్నాలు అభినందనీయమని చంద్రబాబు పేర్కొన్నారు.










