మదనపల్లెలో సంచలనం సృష్టించిన గ్లోబల్ ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు తాజాగా పదో నిందితుడు నార్ల వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన ఇతడు గత ఏడాది నుంచి పరారీలో ఉన్నాడు.
ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ ఆంజనేయులు సహా తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ దాతలు, గ్రహీతలను సమకూర్చడంలో ఇతడు కీలక పాత్ర పోషించినట్లు డీఎస్పీ మహేంద్ర వెల్లడించారు.










