పుంగనూరు నియోజకవర్గం కల్లూరు బంగ్లా వద్ద రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కరిముల్లా ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం షాపుల ద్వారా పంపిణీ పునరుద్ధరించిన నేపథ్యంలో, పెండింగ్లో ఉన్న కమిషన్లు, నెట్వర్క్ సమస్యలు మరియు మౌలిక వసతులపై డీలర్లు చర్చించారు.
తమ సమస్యలను తక్షణమే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరనున్నట్లు కరిముల్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న పలువురు రేషన్ డీలర్లు పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారు.










