విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాణి గారి తోటలో పర్యటించి, అమృత్ 2.0 కింద నిర్మిస్తున్న 1000 కి.లీ. రిజర్వాయర్ పనులను పరిశీలించారు.
ప్రజలకు త్వరగా మంచినీరు అందించేలా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే అన్న క్యాంటీన్లో పారిశుధ్యం, సౌకర్యాలను తనిఖీ చేస్తూ, నేషనల్ హైవే వెంట గ్రీన్ బెల్ట్ పెంచాలని సూచించారు.









