పుంగనూరు మండలం గడ్డురు చెరువు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. గొల్లపల్లికి వెళ్తున్న షేర్ ఆటో, బైక్ను ఢీకొట్టి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న వాలెప్ప, ప్రమీల మరియు ఆటో డ్రైవర్ అంజప్ప గాయపడ్డారు. క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









