విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) – 2026 లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నౌకాదళ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
భారత నావికాదళ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పే ఈ చారిత్రక ఘట్టంలో రాష్ట్రపతితో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
వివిధ దేశాలకు చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఈ కవాతులో పాల్గొని విశాఖ తీరంలో కనువిందు చేశాయి.
#InternationalFleet









