మదనపల్లి హత్యాచారం కేసు: నిందితుడి మృతదేహాన్ని నిరాకరించిన కుటుంబ సభ్యులు

0
1

మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారిపై అమానుషానికి పాల్పడి, ఆత్మహత్య చేసుకున్న నిందితుడు కులవర్ధన్ మృతదేహాన్ని స్వీకరించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు.

పోస్టుమార్టం అనంతరం ఎవరూ ముందుకు రాకపోవడంతో, పోలీసులు అతని పెదనాన్న సమ్మతితో ప్రక్రియ పూర్తి చేశారు.

చివరకు మృతదేహం కోసం ఎవరూ రాకపోవడంతో, మున్సిపాలిటీ సిబ్బంది ద్వారా అనాథ శవంగా ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సమాజం పట్ల నిందితుడు చేసిన ఘోరానికి కుటుంబమే అతడిని వెలివేసింది.