మదనపల్లెకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, గ్రీన్ వ్యాలీ స్కూల్ యజమాని రవీంద్ర (62) అనారోగ్యంతో కన్నుమూశారు. బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు.
నాలుగు దశాబ్దాలుగా పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ, మదనపల్లె రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. రవీంద్ర మృతి పట్ల టీడీపీ శ్రేణులు మరియు స్థానిక ప్రజలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.










