షాకింగ్: టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్త దారుణ హత్య!

0
0

మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో టీవీ సౌండ్ వివాదం హత్యకు దారితీసింది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు ఆగ్రహం చెందిన భార్య క్రాంతి, భర్త షేక్ అహ్మద్ (26) ను కత్తితో పొడిచి చంపింది.

ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న అహ్మద్, క్రాంతిని ఏడాదిన్నర క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, నిందితురాలు క్రాంతిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.