విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ దర్శనానికి శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆలయ ఈవో కే.ఎస్. రామారావు (సీన నాయక్) స్వయంగా స్కానింగ్ పాయింట్ వద్ద ఉండి క్యూ లైన్లను పర్యవేక్షించారు.
భక్తుల టిక్కెట్లను తనిఖీ చేస్తూ, ఎక్కడా జాప్యం లేకుండా వేగంగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణతో ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన దర్శనం లభించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.










