రొంపిచర్ల ఏపీ మోడల్ స్కూల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిన్సిపల్ రెడ్డి ప్రదీప్ తెలిపిన వివరాల ప్రకారం, ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఫిబ్రవరి 24 నుండి మార్చి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఓసీ, బీసీలు ₹150, ఎస్సీ, ఎస్టీలు ₹75 ఫీజు చెల్లించి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
# కొత్తూరు మురళి.










