విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి: కలెక్టర్ రాహుల్ రాజ్

0
0

విద్యార్థుల విద్యా ప్రగతిపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. విద్యార్థులు చదువులో రాణించాలంటే కేవలం ఉపాధ్యాయుల కృషే కాకుండా, ఇంటి వద్ద తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.

పిల్లల అలవాట్లు, చదువుపై వారి ఆసక్తిని గమనిస్తూ వారిని ఉన్నత శిఖరాలకు చేర్చేలా బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.