బాపట్ల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీవో (RDO) గ్లోరియా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ రికార్డులు, కంప్యూటర్ విభాగం మరియు సిబ్బంది హాజరును ఆమె పరిశీలించారు.
ముఖ్యంగా పట్టాదారు పాసుపుస్తకాలు, ధృవీకరణ పత్రాల దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ సలీమా మరియు సిబ్బంది పాల్గొన్నారు.
#Narendra










