కాంగ్రెస్ నేతల తీరు దేశ ప్రతిష్ఠకు నష్టం: సీఎం చంద్రబాబు మండిపాటు

0
0

ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ నేతలు బట్టలు విప్పి నిరసన తెలపడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై ఇలాంటి చర్యలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని విమర్శించారు. వినుకొండలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..

టెక్నాలజీని స్వాగతించాల్సింది పోయి ఇలా చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు.