రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు పారువేట ఉత్సవంతో వైభవంగా ముగింపు దశకు చేరుకున్నాయి.
ఈ వేడుకలో హిందూ, ముస్లిం సోదరులు కలిసి పాల్గొని మతసామరస్యాన్ని చాటారు. ఏపీతో పాటు కర్ణాటక నుండి కూడా భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
రెండు రాష్ట్రాల భక్తుల జయజయధ్వానాల మధ్య, పారువేట మైదానంలో స్వామివారి వేట ఉత్సవం అత్యంత కోలాహలంగా సాగింది.









