కార్యకర్తలకు అండగా ఉంటాం: గద్దె క్రాంతి కుమార్

0
0

టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని యువ నాయకుడు గద్దె క్రాంతి కుమార్ భరోసా ఇచ్చారు.

సోమవారం 19వ డివిజన్ జార్జిపేటలో పర్యటించిన ఆయన, పార్టీ కార్యకర్త శాయమ్మ మనవరాలి కాలేజీ ఫీజు కోసం తన సొంత నిధుల నుంచి రూ. 20 వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యకర్తల సంక్షేమమే పార్టీ బలమని, వారి కష్టాల్లో భాగస్వాములు కావడం తమ బాధ్యతని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.