ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ ప్రజాప్రతినిధుల కోసం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు జరగనున్నాయి.
ప్రధాన ఆకర్షణగా నిలవనున్న క్రికెట్ పోటీల్లో ఒక జట్టుకు మంత్రి నారా లోకేశ్, మరో జట్టుకు మంత్రి నాదెండ్ల మనోహర్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
ఒకవేళ మూడో జట్టు ఏర్పాటైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యం వహించే అవకాశం ఉంది. రాజకీయాలకు విరామం ఇచ్చి నేతలు క్రీడాస్ఫూర్తిని చాటనున్నారు.
