సదుం మండలం చెరుకువారిపల్లె పోస్టల్ నగదు వివాదంపై బీపీఎం ధనలక్ష్మి మంగళవారం స్పందించారు. తన వద్ద తపాలా శాఖకు చెందిన కొందరు అధికారులు నగదు తీసుకున్నారని, రశీదులు ఇస్తామని చెప్పి తనను మోసం చేశారని ఆమె ఆరోపించారు.
నగదు చెల్లింపులకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, దీనిపై ఉన్నతాధికారులను సంప్రదిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచిస్తున్నారని ఆమె వెల్లడించారు.
# కొత్తూరు మురళి.









